మన్యంటీవీ ఏటూరునాగారం:
గోవిందరావుపేట మండల కేంద్రంలోని శనివారం మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి పులుగుజ్జు వెంకన్న మాట్లాడుతూ 135 మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరూ ఏకం కావాలని పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా తమ హక్కులను సాధించుకోవడం కోసం ఐక్య ఉద్యమాలను కొనసాగించాలని, కార్మికులకు పిలుపునిచ్చారు. దేశంలో పాలకవర్గాల తీరు చూస్తే కార్మికులకు కనీస వేతనం అమలు లేదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి దారులకు దోశిపెడుతూ కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మికుల అందరితో వెట్టి చాకిరి చేయించుకుంటూ దేశంలో 44 కార్మిక చట్టాలను నాలుగు కొడ్ లుగా విభజించి కార్మికులను రోడ్డున పడేశారు. అదేవిధంగా ఈ కరోనా కష్టకాలంలో కార్మికులకు ప్రజలందరికీ కేరళ ప్రభుత్వ తరహాలో దేశంలో ఉన్న ప్రజలందరికీ నిత్యావసర సరుకులు అందజేయాలని ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ప్రజల శవాలతో వ్యాపారం చేయకుండా ఉచిత వ్యాక్సిన్ ప్రతి కుటుంబానికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వా లను డిమాండ్ చేశారు. మండలంలో వివిధ గ్రామాలలో, మండల సెంటర్లలో మే డే ఉత్సాహాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొదిల చిట్టిబాబు, గుండు రామస్వామి, అంబాల పోషలు, తీగలాగ రెడ్డి, జిట్టబోయిన రమేష్, కేతన్ సూర్యనారాయణ, పోలే పాక మహేందర్, ఐలయ్య, వంక నగేష్, సదానందచారి, కురసం ముత్తయ్య, సేలం సమ్మయ్య, లెనిన్ గుండు సత్యనారాయణ మంగ, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: