CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సర్వే సిబ్బంది రిఫర్ చేస్తేనే కరోనా పరీక్షలు

Share it:

 


ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడం తోనే కరోనా కేసులు

వైద్య సిబ్బంది అంత కరోనా బారిన పడితే మేము ఏమి చేయలేము

రాజకీయ నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి

అశ్వాపురం మండల వైద్యాధికారి మణీకంఠారెడ్డి

ప్రజలు కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం ఉంటే గ్రామాలలో సర్వే చేస్తున్న ఏ ఎన్ ఎం లు,  ఆశ వర్కర్లు, వీ ఆర్ ఓ లు, వీ ఆర్ ఏ లు, అంగన్వాడీ ల దృష్టికి తీసుకెళ్లాలని అశ్వాపురం మండల వైద్యాధికారి డాక్టర్ మణికంఠారెడ్డి సూచించారు. కరోనా అనుమానిత  లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే సిబ్బంది మందులు ఇస్తారని మూడు రోజులు గడిచిన తర్వాత  తగ్గకపోతే సర్వే సిబ్బంది రిఫర్ చేస్తేనే పీ హెచ్ సీ లో కరోనా పరీక్షలు చేస్తామన్నారు. ఎవరికి వారు గా పీ హెచ్ సీ కి వస్తే కరోనా పరీక్షలు చేయమన్నారు. ప్రజలు లాక్ డౌన్ లెక్క చేయకుండా  మాస్క్ లు లేకుండా విచ్చల విడిగా, గుంపులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని ప్రజలు బయట తిరగవద్దన్నారు. శుభ కార్యాలు చేసిన గ్రామాల్లో కరోనా జాగ్రత్తలు పాటించకపోవడంతో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నయన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు కరోనా లక్షణాలు ఉన్నవారు ప్రజలు అందరు బయట తిరగడంతో కరోనా కేసులు వస్తున్నాయన్నారు.  కరోనా పరీక్షల కోసం వందల మంది పీ హెచ్ సీ కి వస్తున్నారన్నారు. నాతో పాటు సిబ్బంది కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు. మేము అంత  కరోనా బారిన పడితే  ప్రజలకు వైద్య సేవలు అందించలేమని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలు జాగ్రతలు పాటించకుండా ప్రభుత్వం వైద్య సిబ్బంది పై ఆధారపడటం సరి కాదు అన్నారు.  ప్రజలు బయట తిరగవద్దని మాస్క్ లు ధరించాలని  జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకులు కరోనా విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: