మన్యం టీవీ ఏటూరు నాగారం:
బుధవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలో లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తున్న ఏటూరునాగారం ఏఎస్పి గౌస్ ఆలం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్ డౌన్ ను 30 మే వరకు ప్రభుత్వం పొడిగించడం జరిగింది. ప్రజలు వారికి అవసరమైన నిత్యావసర వస్తువుల ను ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు తీసుకోవాలి, కచ్చితంగా మాస్కు ధరించాలి సామాజిక దూరం పాటించాలి. దుకాణాల యజమానులు వారి వద్దకు వచ్చే కస్టమర్లను సామాజిక దూరం పాటించేలా చూడాలని అన్నారు. ఉదయం 10 గంటల తర్వాత లాక్ డౌన్ ఉల్లంఘన చేసి బయట తిరగడం చేయకూడదని, ఇలా అనవసరంగా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేయించుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కరోనా వచ్చిన వారు ఎట్టి పరిస్థితిలో బయటికి రాకూడదని అలాగే ప్రతి ఒక్కరూ పోలీసువారికి సహకరించి కరోనా కట్టడి విషయంలో తమ వంతు బాధ్యతగా వహించాలని అన్నారు.
Post A Comment: