మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు డివిజన్ లో ఉన్నటువంటి 7 మండలాలు బూర్గంపాడు,ఆళ్లపల్లి,అశ్వాపురం,గుండాల,కరకగూడెం,పినపాక,మణుగూరు మండలాల నుండి పామాయిల్ పంట సాగుకు ఆసక్తిగల రైతులు ముందుకు రావాలని ని అగ్రికల్చర్ ఏవో తాతారావు పిలుపునిచ్చారు.ఆసక్తిగల రైతులు నీటి సౌకర్యం, భూగర్భ జలాలు,విద్యుత్ సరఫరా,బిందుసేద్యం వసతి కలిగినటువంటి రైతులు తప్పనిసరిగా ఆయిల్ ఫామ్ తోటను సాగు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ వారి ద్వారా చేపట్టుటకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ మణుగూరు డివిజన్ లో ఉన్నటువంటి ఏడు మండలాలకు ఒక్కొక్క మండలానికి బూర్గంపాడు 100 ఎకరాలు,ఆళ్లపల్లి 100 ఎకరాలు,అశ్వాపురం 100 ఎకరాలు,గుండాల 100 ఎకరాలు,మణుగూరు 50 ఎకరాలు,కరకగూడెం 50 ఎకరాలు,పినపాక 50 ఎకరాల్లో తోటలు సాగుచేయుటకు ఆమోదించారు అని తెలిపారు.సాగు చేయుటకు పైన తెలిపిన అన్ని అర్హతలు కలిగినటువంటి రైతులు వారి పట్టా పాస్ బుక్,ఆధార్ కార్డు జతపరిచి సమీపంలో ఉన్నటువంటి క్లస్టర్ ఏఈఓ ల వద్ద ఉన్నటువంటి దరఖాస్తు పూర్తి చేసి, సంబంధిత ఏఈఓ అందించాలని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తో తోటల సాగుకు ప్రభుత్వం అనుసంధానం చేసిందని తెలిపారు.కావున ఈ పథకం ద్వారా సాగును చేపట్టే రైతులకు ఐదు ఎకరాలకు మాత్రమే అవకాశం ఉన్నదని తెలిపారు.పథకం తో సంబంధం లేకుండా సాగు చేపట్టే రైతులకు 10 ఎకరాలు సాగు చేసుకోవచ్చని తెలిపారు.ఈ ఆయిల్ ఫామ్ సాగుకు తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి అన్నారు.భూసార పరీక్షలు చేసుకుని,రైతులు సాగు చేసుకోగలరని తెలిపారు ఆసక్తిగల రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అగ్రికల్చర్ ఏఓ తాతారావు తెలిపారు.
Navigation
Post A Comment: