👉పచ్చి రొట్ట ఎరువుతో దిగుబడి మెరుగు.
(అన్నపురెడ్డిపల్లి మండల వ్యవసాయాధికారి-అనూష)
మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, గుంపెన గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పిఎసిఎస్) నందు, ది:26-05-2021 నుండి రైతులకు సబ్సిడీపై జిలుగు, పిల్లిపెసర విత్తనాలు అందుబాటులో ఉంటాయని,మండల వ్యవసాయ అధికారి-అనూష తెలియజేశారు. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, పిల్లిపెసర, జనుము మొదలగు జీవపదార్థం గల మొక్కలను పొలంలో పెంచి, పూత దశలో భూమిలో కలియ దున్నడం వలన, నేల భౌతిక స్వభావంతో పాటు సారవంతం, సూక్ష్మజీవులు వృద్ధి చెంది, తద్వారా పోషకాల లభ్యత చేకురి పంట లో అధిక దిగుబడి సాధించవచ్చని, రసాయనిక ఎరువుల వినియోగ శాతాన్ని కూడా తగ్గించవచ్చని, వ్యవసాయ అధికారి(ఎఓ) అనూష ఈ సందర్భంగా రైతులకు తెలియజేశారు.
Post A Comment: