మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం రమణక్కపేట గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ పర్సన్ తన విధులను సక్రమంగా పనిచేయడం లేదని ఎవరికీ చెప్పా పెట్టకుండా వారాల తరబడి విధులకు గైర్హాజరు అవుతున్నాడని దానితో అతను నిర్వర్తిం చాల్సిన విధులను నిర్వహించక పోవడం వలన ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి కాలని వాసులు ఇబ్బందులు పడుతున్నారని రమణక్కపేట సిఎస్ఐ చర్చి కాలని వాసులు మంగపేట మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ కు వినతిపత్రాన్ని అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఇంతకు ముందు గ్రామ కార్యదర్శిని కలిసి విధులు సరిగా నిర్వర్తించని వరికిల్ల సాయిని విధుల నుండి తొలగించి అతని స్థానంలో నూతనంగా మల్టీ పర్పస్ పర్సన్ నియమించ వలసినదిగా కాలని వాసులు కార్యదర్శికి లిఖిత రూపంలో లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. పంచాయతీ విధులకు డుమ్మా కొట్టే మల్టీ పర్పస్ పర్సన్ తొలగించి వెంటనే మరొక వ్యక్తిని నియమించి పేరుక పోయిన చెత్తను వెంటనే తొలగించాలని నీటి సమస్యను తీర్చాలని వారు అన్నారు. వినతిపత్రం స్వీకరించిన ఎంపిఓ గ్రామసభ పెట్టి వేరే ఎవరికీ ఎక్కువ మద్దతు ఉంటే వారినే ఎంపిక చేయడం జరుగుతుందని అప్పటి వరకు అభియోగం ఉన్న వర్కర్ పనిలోకి రాకుండ ఉండాలని చూసించారు.వినతిపత్రం ఇచ్చిన వారిలో చిట్యాల బాలకృష్ణ,రమేష్,వంశీ,సాంబ శివరావు,రంజిత్,బట్ట రాములు,అరవింద్, చంటి,రమేష్,వంశీ, ప్రశాంత్,నరేష్,రాధాకృష్ణ, ధనలక్ష్మి,వినయ్,రాజశేఖర్, సాయి చిన్ని,బాబు,రాములు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: