👉గజమాలతో సన్మానించినజిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య.
మన్యం టీవీ, భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం.వీ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనున్న సందర్భంగా యం.వీ రెడ్డి దంపతులను జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య గజమాలతో సన్మానించారు.
కార్యాక్రమ అనంతరం ఛైర్మన్ ప్రసంగిస్తూ తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రకృతి వనం కార్యాక్రమాన్ని జిల్లాలో పరుగులు పెట్టించిన ఘనత వారిదేనన్నారు.
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నా జిల్లా ప్రజల పరిరక్షణలో అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఆయన చేపట్టిన కార్యాక్రమాలు అమోఘమైనవని కొనియాడారు.
తమ శేషజీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకున్నారు.
ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, జడ్పీ సీఈఓ విద్యాలత,జడ్పీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి రాజేష్,జడ్పీటీసీలు బరపాటి వాసుదేవరావు,పైడి వెంకటేశ్వర్లు, కామిరెడ్డి శ్రీలత,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: