మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం జానంపేట గ్రామ సమీపంలో 10 టేకు దిమ్మలను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని తెలియజేశారు. జానంపేట సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా లక్షా నలభై వేల విలువచేసే టేకు దిమ్మల పట్టుకొని, ట్రాక్టర్ యజమాని పూనెం శంకర్ పై కేసు నమోదు చేసినట్లు గా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ బి వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లు వేణు,నాగేంద్ర బాబు,సి.హెచ్ రంగారావు, బి రవీందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా పినపాక మండలం లోని తోగ్గూడెం గ్రామంలోని జనగం సంజీవయ్య ఇంటి వద్ద చనిపోయిన కొండముచ్చు మృతదేహాన్ని పట్టుకున్నామని, ఈ విషయమై కూడా కేసు నమోదు చేస్తున్నామని ఎఫ్ఆర్ఓ తేజస్విని తెలియజేశారు.
Post A Comment: