మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మణుగూరు డివిజన్ అధ్యక్షులు కారం. నాగేశ్వరరావు కొద్దిసేపటి క్రితం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. వారు గత పది రోజులుగా కరోనా తో బాధపడుతూ భద్రాచలం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.మణుగూరు డివిజన్ లో జెఏసీ అధ్వర్యంలో ఎన్నో ఆదివాసీ ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివాసి ఉద్యమ కెరటం, భవిష్యత్ తరాల ఆశాజ్యోతి, మృదుస్వభావి,మిత్రుడు అయిన కారం నాగేశ్వరావు మరణం ఆదివాసీ సమాజానికి తీరని లోటు అని ఆదివాసి ఉద్యోగుల, సాంస్కృతిక సంఘం అధ్యక్షులు పోలేబొయిన అనిల్ కుమార్, పలువురు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Post A Comment: