మన్యం మనుగడ,పినపాక:
పినపాక మండలంలోని జానంపేట గ్రామం లో రెక్కాడితే గానీ డొక్కాడని నిరు పేద కుటుంబాలు కరోన బారిన పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వారి దీన పరిస్థితిని తన అక్కున చేర్చుకుంది అభయ్ దళిత్ సేవా సొసైటీ. జానంపేట గ్రామంలో ఆ సంస్థ అధ్యక్షులు కుమ్మరి వెంకటేశ్వర్లు , ఉపాధ్యక్షులు వరికిళ్ల వీర్రాజు
ఆధ్వర్యంలో మానవత దృక్పథంతో నిత్యావసర సరుకులు,గుడ్లు, పప్పు, నూనె, సబ్బులను కరోన బారిన పడిన కుటుంబాలకు అందచేశారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జనరల్ సెక్రెటరీ రామటెంకి బాబురావు , జాయింట్ సెక్రెటరీ దేపాక శివ , ట్రెజరర్ మదారి రాజు, ఇల్లంగి జీవన్ , చెట్టి కొండయ్య , బుడుగుల శ్రీను , బందేల కన్నారావు , వరి కిల్లా శ్రీను , దుర్గం విష్ణు, సునారీ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: