మన్యం టీవీ మంగపేట.
మంగపేట కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లికొండ యాదగిరి కరోనా బారినపడగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క హుటాహుటిన రాజుపేట పల్లికొండ యాదగిరి కాంగ్రెస్ మంగపేట ఎస్సి సెల్ అధ్యక్షుడిని స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించారు. ఎమ్మెల్యే సీతక్క పల్లికొండ యాదగిరి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదని తెలుసుకున్న సీతక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దంటు మంచి పోషకాహారం తీసుకుంటూ సమయానికి మందులు వేసుకోవాలని సూచనలు చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ పల్లికొండ యాదగిరి సీనియర్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా ఉంటూ క్రియాశీల పాత్ర పోషించిన మంగపేట కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లికొండ యాదగిరి త్వరగా కోలుకుని మరల పార్టీలో ముఖ్య భూమిక పోషించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాజుపేట కాంగ్రెస్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: