మన్యంటీవీ,అశ్వారావుపేట:
కరోనా శరవేగంగా విస్తరిస్తుంది. ఒక్క రోజే మండలంలో ఆరుగురు మృతి చెందడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులో శుక్రవారం నాటికి 15 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 9 మంది ఆరోగ్యం నిలకడగా ఉండగా ముగ్గురు మాత్రం ఆక్సిజన్ సహాయంతో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ముగ్గురు మృతి చెందినట్టు డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ముగ్గురిలో అశ్వారావుపేట కోనేటి బజారుకు చెందిన ఎం.నాగేశ్వరరావు (67), మండలంలోని ఊట్లపల్లి పంచాయతీ గంగారంకి చెందిన నార్ల లక్ష్మి (70), దమ్మపేట మండలం తాటి సుబ్బన్న గూడెంకు చెందిన వి.అన్వేష్ (25) గా డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా వినాయకపురంకు చెందిన శ్రీదేవి (35) గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో ఇంటికి వెళ్ళి తీవ్ర అస్వస్థతకు లోనై మృతి చెందినట్టు సమాచారం. అశ్వారావుపేటకు చెందిన జల్లిపల్లి గంగాధర్ రావు (గంగన్న) హైద్రాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అశ్వారావుపేటలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, కామయ్యపాలంకు చెందిన సమయమంతుల వీరేశ్వరరావు (63) రాజమండ్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Post A Comment: