మన్యంటీవీ,అశ్వారావుపేట: మండల పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం ముమ్మరంగా శానిటేషన్ పనులు చేశారు. కరోనా సెకెండ్ వేవ్ కేసులు విజృంభిస్తున్న తరుణంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సర్పంచ్ అట్టం రమ్య ఆధ్వర్యంలో ప్రధాన రహదారులను, వీధులను శుభ్రం చేయించి ముమ్మరంగా బ్లీజింగ్ పౌడర్ చల్లించారు. కోవిడ్ మహమ్మారి రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: