మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని అమరారం గ్రామంలో కరోన వైరస్ తో 10 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్న విషయం తెలుసుకున్న పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి బాధిత కుటుంబాలకు 1500/- విలువ గల బియ్యం, నిత్యావసర సరుకులు,కూరగాయలను స్థానిక సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, ఎంపీటీసీ కాయం శేఖర్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులు సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఎంపీటీసీ కాయం శేఖర్,సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, టి. ఆర్. ఎస్ నాయకులు గుమ్మడి అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: