మన్యం టీవీ :-
కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు సత్తుపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని గిరిజన బాలికల హాస్టల్ నందు ఏర్పాటు చేసిన 50 పడకల కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ కరోనా బారిన పడి హోమ్ క్వరెంటాన్ ఉండడానికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న వారి కొరకు ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని బాధితులు ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని అని కోరారు. ఈ కేంద్రాల్లో టిఫిన్ భోజనాలను పురపాలక సంఘం ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుందని అని తెలిపారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజల వ్యక్తిగత జాగ్రత్తలు పాటించి తమకు సహకరించాలని కోరారు.
Post A Comment: