మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామపంచాయతీ నందు గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో దాది దుర్గయ్య అనే రైతుకు చెందిన అరటి తోట అంతా నేలకు ఒరిగింది. అరటి తోటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన అరటి తోట ఇలా నష్టం వాటిల్లే సరికి శుక్రవారం దుర్గయ్య కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వం స్పందించి తగిన నష్టం పరిహారం వచ్చేలా చూడాలని కోరారు.
Post A Comment: