మన్యం టీవీ, అశ్వరావుపేట:
మండల పరిధిలోని నారంవారి గూడెం గ్రామ పంచాయితీ కొత్త నారంవారి గూడెం గ్రామం నందు చిట్టితల్లి సేవాసమితి వ్యవస్థాపకులు మరియు నారం వారిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం కరోనా బారిన పడిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం, పప్పు, కోడిగుడ్లు, నూనె అందించారు. అదేవిదంగా గ్రామ ప్రజలకు కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ధైర్యంగా ఉండాలని భరోసా కలిపించారు. ఈ కార్యక్రమంలో సురేష్, రవిశేఖర్, వెంకటేశ్వరరావు, చలపతి, సత్యనారాయణ, శ్రీను, రవి కిషోర్, డీజే బాజీ, వనమా గోపి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: