మన్యం టీవీ, అశ్వాపురం:ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు వారి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఎంపీపీ ముత్తినేని సుజాత చెతులమీదుగా అశ్వాపురం మండల కేంద్రంలోని కరోనా వ్యాధి బాదితులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె ఖదీర్,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,మండల ఎస్ సి సెల్ నాయకులు గద్దల రాము,ఇసంపల్లి అశోక్,శివ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: