CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వ‌రంగ‌ల్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్

Share it:

 



ఎంజిఎం కొవిడ్ వార్డుల సందర్శన 

 

 వరంగల్ : సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో వ‌రంగ‌ల్‌కు చేరుకున్నారు. 


హ‌న్మ‌కొండ‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానం నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో సీఎం కేసీఆర్ ఎంజీఎంకు వెళ్ళారు. 


రెండు రోజుల కిందట గాంధీ దవాఖానను పరిశీలించిన విషయం తెలిసిందే. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి, వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మిగతా జిల్లాల్లోనూ పర్యటించాలని సంకల్పించిన సీఎం ఇవాళ వరంగల్ ఎంజీఎంను సంద‌ర్శిస్తున్నారు. ఎంజీఎంను సంద‌ర్శించిన త‌ర్వాత వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును ప‌రిశీలించ‌నున్నారు.


కాకతీయ మెడికల్‌ కాలేజీని ఆనుకొని ఉన్న జైలును ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జైలును సందర్శించి, నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి కెప్టెన్‌ ఇంటికి చేరుకొని భోజనం చేయనున్నారు. ఆ తర్వాత 2 గంటలకు ఎంజీఎం దవాఖానకు వెళ్తారు. రోగులతో మాట్లాడడంతో పాటు దవాఖానలోని మౌలిక వసతులను పరిశీలిస్తారు. అనంతరం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: