CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా రాజీవ్ గాంధీ 30 వర్ధంతి వేడుకలు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం:

ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  రాజీవ్ గాంధీ 30 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని తోపుడు బండ్లు చిరు వ్యాపారులకు నిత్యవసర సరుకులు బియ్యం పప్పు నూనె ఇతర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి చేసిన ధ్రువతార ఐటి రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బంధువు యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పిస్తూ యువత రాజకీయాల్లోకి చురుకుగా పాల్గొనేలా చేసిన సంస్కర్త రాజీవ్ గాంధీ అని భారత దేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు పరిపాలనా సంస్కరణలు తెచ్చిన నాయకులు దేశ సౌభ్రాతృత్వం కాపాడడం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులు నవభారత నిర్మాత భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని అన్నారు. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలన అధ్యక్షులు, భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, మండల అధ్యక్షులు ఎండి చాంద్ పాషా, జిల్లా కార్యదర్శి శ్యామ్, ఆత్మ డైరెక్టర్ ఆకుతోట చంద్రమౌళి, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండి అజ్జు, రవీందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వంశీకృష్ణ, వార్డు సభ్యులు వలి, జిల్లా కార్యదర్శి రాజు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: