సహాయాన్ని అందజేసిన హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అద్యక్షులు యలగల నవనీత్, విత్తనల సుధీర్
మాన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో కరోనా వచ్చి హోం హైసోలేషన్ లో ఉంటూ భోజనానికి ఇబ్బంది పడుతున్న పేషంట్స్ కి రోజు కి రెండు పూటలా భోజనాన్ని ఉచితంగా అందిస్తున్న అశోక్ నగర్ చెందిన శివ- జ్యోతిర్మయి దంపతులను ప్రోత్సహిస్తూ బాధితుల సహాయార్థం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అద్యక్షులు యలగల నవనీత్,విత్తనాల సుధీర్ శుక్రవారం బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు.ఈ సందర్భంగా వారి సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో చంటి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: