చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
మహమ్మారి కరోనా వైరస్ కు చండ్రుగొండ మండలంలో గురువారం ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండల పరిధిలోని తిప్పనపల్లి గ్రామానికి చెందిన షేక్ గులాం మౌలాలి (39) అలియాస్ బుట్టి. లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇటివలే కరోనా పాజిటివ్ రావడంతో. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించింది. దీంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారి మృతి చెందాడు. అలాగే బెండాలపాడు గ్రామానికి చెందిన మడి కామయ్య , కు కరుణ పాజిటివ్ రావడంతో అతని ఇంటి వద్దనే హోం ఐస్ లేషన్ లో ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో మృతిచెందాడు. కామయ్య కు దహన సంస్కారాలకు చేయటానికి గ్రామస్థులు రాకపోవడంతో కుటుంబ సభ్యులే పీపీఈ కిట్లు ధరించి దాన సంస్కారాలు నిర్వహించారు.
Post A Comment: