అంగన్వాడి టీచర్ కుటుంబానికి అందిన సాయం.
మన్యం మనుగడ కథనానికి స్పందించిన ఎంపీపీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు
మన్యం మనుగడ, పినపాక:
అత్తమామల వయో భారం, కన్న కొడుకుకి కి గుండెలో రంధ్రం కారణంగా ఆయాసం, ఈ కారణంగా ఆ కుటుంబానికి ఆర్థిక భారం. ఈ విషయమై "మన్యం మనుగడ"లో సారు..... నన్ను కొంచెం ఆదుకోరు... శీర్షికన వెలువడిన కథనానికి పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి స్పందించి తమ సహాయాన్ని ఆ కుటుంబానికి అందించారు. బుధవారం రోజున అమరారం గ్రామంలో గల అంగన్వాడీ ఉపాధ్యాయురాలు నివాసానికి వెళ్లి, పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం గా అందించారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి 100 కేజీల బియ్యం, కూరగాయలు పండ్లు రూపంలో సహాయాన్ని అందించారు. రేషన్ కార్డు లేని కారణంగా బియ్యం వచ్చే పరిస్థితి లేదని తెలుపగా, ఎంపీపీ గుమ్మడి గాంధీ, దొడ్డ శ్రీనివాస్ రెడ్డి లు స్పందించి ప్రతి నెల నూతన కార్డు వచ్చేవరకు, బియ్యం అందే విధంగా సహాయం చేస్తామని, హామీ ఇచ్చారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఎమ్మెల్యే రేగా కాంతారావు సహకారంతో గుండె ఆపరేషన్ అయ్యే విధంగా చూస్తామని, హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో అమరారం గ్రామపంచాయతీ సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, పినపాక మండల ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్, బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: