మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం పంచాయితీ
మారుమూల ఆదివాసీ వలస గిరిజన గ్రామమైన రేగులగండిలో సోమవారం మణుగూరుకి చెందిన *భరోసా వెల్ఫేర్ సొసైటీ* ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సొసైటీ సభ్యులు ఎండీ.అమీనుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా రెండవ దశలో చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నారు.ప్రతి వ్యక్తి ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, కుటుంబ సభ్యుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.ప్రతిఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలన్నారు.ఈ క్రమంలోనే తమ కమిటీ సభ్యుల సహకారంతో రేగులగండి లోని సుమారు 50 కుటుంబాలకు చెందిన 180 మందికి ఉచితంగా అత్యంత నాణ్యమైన మాస్కులను అందించామన్నారు.రాబోయే రోజుల్లో తమ కమిటీ ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు.అనంతరం స్థానిక సర్పంచ్ ఏనిక.ప్రసాద్ మాట్లాడుతూ కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గ్రామస్థులకు వివరించారన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు హరీష్,రాజేష్, జహీర్ ఖాన్,కునవారం సర్పంచ్ ఏనిక ప్రసాద్, టీబీజీకేఎస్ నాయకుడు కోట శ్రీనివాసరావు,వార్డు సభ్యులు శ్వేతన్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: