CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా కట్టడికి చర్యలు

Share it:

 


 హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయించిన జమ్మి గూడెం గ్రామ పంచాయతీ సిబ్బంది



 మన్యంటీవీ,అశ్వారావుపేట:

మండలంలో కరోనాకేసులు పెరుగుతున్న నేపథ్యంలో మండల వ్యాప్తంగా కోవిడ్ కట్టడికి ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు ముమ్మురం చేశారు. పారిశుధ్య కార్యక్రమంలో బాగంగా జమ్మిగూడెం గ్రామ పంచాయితీ లో జమ్మి గూడెం గ్రామ పంచాయతీ సిబ్బంది హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది ప్రజలు అప్రమత్తంగా స్వీయనియంత్రణ పాటించాలని, అవసరం లేకుండా రోడ్ల మీదకు రావద్దన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుందని ప్రజలు కూడా సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా మాస్కు ధరించాలని, అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: