మన్యం మనుగడ ,పినపాక:
ట్రాక్టర్ పై నుండి బాలుడు పడి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం పంచాయతీకి చెందిన పోతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. పోతిరెడ్డిపల్లి గ్రామమునకు చెందిన బొగ్గం శ్రీను కుమారుడు, బొగ్గం వరుణ్ ట్రాక్టర్ పై నుండి, కింద పడడంతో ట్రాక్టర్ ట్రాలీ చక్రం కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భద్రాచలం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఏడూళ్ల బయ్యారం ఎస్ఐ టీవీఆర్ సూరి తెలిపారు
Post A Comment: