CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మిషన్ భగీరథ నీళ్లుసరిగా రావడం లేదు

Share it:

 


లీకుల సమస్యతో తాగు నీరు వృధా

మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండలం రాజుపేట లో మిషన్ భగీరథ నీరు వారానికి నాలుగు రోజులు రావు,వచ్చినా అవి పట్టుమని పదిబిందెలు కూడా వచ్చే పరిస్థితి లేదు. రాజుపేట గ్రామస్తులు ఈ విషయం పై మిషన్ భగీరథ సంబందించిన అధికారులను అడగ్గా,కరెంటు లేదు అందుకే నీళ్లు వదల లేదు అంటారు, ఇక్కడ కరెంటు ఉన్న ఎక్కడో కరెంటు లేదు అని చెబుతారు, లేదంటే ట్యాంక్ లో నీళ్లు లేవు, గోదావరి లో నీళ్లు లేవు మీకు ఎక్కడినుండి మేము తెచ్చి ఇవ్వాలని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు,అని ప్రజలు ఆరోపిస్తున్నారు.వచ్చే నీళ్లు అంతంత మాత్రమే అందులో ఎక్కడ చూసినా లీకేజిలు  వచ్చిన నీరు వచ్చినట్లు లీకుల రూపంలో పోతుంటే ప్రజలకు త్రాగు నీటి అవసరాలు ఎలా తీరుతాయో అర్థం కావడంలేదు, ఎక్కడ చూసిన లీకులు,నీరు వృధా గా పోతున్నది, మరమ్మత్తులు చేపట్టేలోపు, వేరే దగ్గర లీకులు వస్తున్నాయి, వీటన్నికి కారణం నాణ్యత లేని పైపులు వాడటం అని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇది మిషన్ భగీరథ కాదు లీకుల భగీరథ అని చమత్క రిస్తున్నారు. ఇక నైనా మిషన్ భగీరథ అధికారులు కండ్లు తెరిచి లీకులను అరికట్టి ప్రజల త్రాగు నీటి అవసరం తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: