CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవత్వం చాటుకున్న టీఆరెస్ నాయకులు

Share it:

 


-కరోనతో మరణించిన వలసకకూలికి అంత్యక్రియలు

- రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస రెడ్డి, టిఆర్ఎస్ యువ నాయకులు ఉడుముల రవీందర్ రెడ్డికి పలువురి అభినందనలు


మన్యం టీవీ,పినపాక:

పినపాక మండలం

దుగినేపల్లి పంచాయితీకి చెందిన నిరుపేద కుటుంబంకి చెందిన వలస కూలి కోడూరి సతీష్(50)కరోనా తో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో దాన సంవత్సరాలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో  

రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస రెడ్డి, టిఆర్ఎస్ యువ నాయకులు ఉడుముల రవీందర్ రెడ్డి దగ్గరుండి అంతక్రియలు జరిపించి అందరికి ఆదర్శంగా

 నిలిచారు. కరోనా విజృంభిస్తున్న,ఇంతటి విపత్కర పరిస్థితుల్లో 

కష్టకాలంలో కూడా ఎవ్వరు సహాయం చెయ్యడానికి కూడా ముందుకు రాకపోవడంతో మానవతా దృక్పథంతో మీకు మేమున్నాం అంటూ,ఆపద సమయంలో ముందుకు వచ్చి,

ఆ కుటుంబానికి అండగా నిలిచి,కరోనా తో మృతి చెందిన వ్యక్తికి అంతక్రియలు జరిపించారు. జేసీబీ కృష్ణరెడ్డి సహాయంతో మృతుడి అంతక్రియలు కొరకు పూడిక తీయించి భార్య నాగేంద్రమ్మ, కుమార్తె సమక్షంలో అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నారు.

తక్షణమే స్పందించి,గొప్ప మనసుతో,ఎవ్వరు ముందుకు రాని ఇంతటి కార్యక్రమాన్నీ దగ్గరుండి నిర్వహించారు.వారితోపాటు మడిపలి వెంకన్న,పోకలి పోతురాజు, సాయిని సత్యనారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వారినిపలువురు మండల వాసులు అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: