కరోనా బాధితులకు బియ్యం,నిత్యావసర వస్తువుల పంపిణీ
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,వేణు రెస్టారెంట్ వెనుక మామిడి తోట లోని ఆదర్శ్ నగర్ గ్రామంలో నివసిస్తున్న బండారి.రామలక్ష్మి,కొడుకు అఖిల్ వీరు ఇద్దరు కరోనా బారిన పడి హోమ్ ఐషాలేషన్ లో ఉంటున్నారు.వీరు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు అని,కుటుంబ పరిస్థితి ని తెలుసుకున్న నవీన్ బాబు, వారి ఆర్మీ సభ్యుల ద్వారా వారికీ నిత్యవసర సరుకులు మరియు 25 కేజీ ల బియ్యం మానవతా దృక్పధం తో నవీన్ బాబు ఆర్మీ కమిటీ సభ్యులు మజీద్,కారం. రాజు,శంకర్,శివ,అరవింద్, రమేష్,ఉదయ్,మధు తదితరులు వారి ఇంటికి వెళ్లి సహాయం ఆందజేయడం జరిగింది అన్నారు.
Post A Comment: