చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
మహమ్మారి కరోనా వైరస్ నిరుపేదల పై భారీగా ప్రతాపం చూపిస్తోంది. కరోనా పాజిటివ్ కుటుంబంలో ఒక్కరికి నిర్ధారణ అయిన కొద్ది రోజుల్లోనే మిగతా కుటుంబ సభ్యులకు కూడా వ్యాప్తి చెందడంతో నిరుపేదలు అల్లాడిపోతున్నారు.. ముఖ్యంగా రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాల్లో ఈ కరోనా మహమ్మారి విలయ తాండవం ఆడుతుంది. దీంతో వారు తినటానికి తిండిలేక బయటకు వెళ్లే పరిస్థితి లేక అల్లాడిపోతున్నారు. దీనిని గమనించిన చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ముందుకు వచ్చి అమ్మ యూత్ నెలకొల్పి స్వచ్ఛందంగా నిరుపేదలకు 10 కేజీల బియ్యం, నూనె, పప్పులు, పాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో మంది నిరుపేదలు. మహమ్మారి కరోనా వైరస్ ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎక్కువ మంది ఆహారం అందక ధైర్యం చెప్పేవారు లేక. నిరుత్సాహానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారి కోసం. ముందుకు వచ్చి మీకు తోచిన సహాయం చేస్తే వారు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మ యూత్ సభ్యులు పాల్గొన్నారు..
Post A Comment: