CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వలస ఆదివాసికి జనం కోసం మనం సాయం

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట పంచాయతీకి చెందిన వలస ఆదివాసి గ్రామం పిట్టతోగుకు చెందిన తాటి సన్ను కుమారుడైన తాటి పండు గత కొన్ని సంవత్సరాల నుండి మూర్ఛ వ్యాధితో బాధపడుతూ 4 సంవత్సరాల క్రితం మండుతున్న పొయ్యిలో పడి శరీరం వెనుక భాగం పూర్తిగా కాలిపోయి, కుడిచేయి శరీరానికి అంటుకొని అప్పటినుండి నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయాన్ని ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షుడు తోలెం శ్రీను పత్రికా మిత్రులకు తెలియజేయగా, పత్రికలలో వచ్చిన కథనాల ద్వారా విషయం తెలుసుకున్న మణుగూరు ప్రాంతానికి చెందిన జనం 

ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్డు లో జనం కోసం మనం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులలో ఒకరైన వేమిరెడ్డి సాంబశివారెడ్డి కూతురు నక్షత్ర పుట్టినరోజు సందర్భంగా  ఆ బాలునికి పది వేల రూపాయల నగదు, 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, ఆ గ్రామానికి సరిపడే విధంగా  దుస్తులను అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా జనం కోసం మనం స్వచ్ఛంద సంస్థ తరఫున సహాయ సహకారాలను అందిస్తామని సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 

ఏడూళ్ల బయ్యారం ఎస్సై టీ. వి. ఆర్ .సూరి హాజరైనారు. గతంలో ఏడూళ్ల బయ్యారం సీఐ దోమల రమేష్, ఎస్సై టీవీ ఆర్ సూరి ల ఆధ్వర్యంలో, పిట్టతోగు గ్రామానికి వెళ్లి బాలుడి పరిస్థితిని గమనించి, వరంగల్ నుండి మందులను తెప్పించి, తాటి పాండు తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. దీని కారణంగా బాలుడి గాయం చాలా వరకు నయం అయింది.

ఈ కార్యక్రమంలోజనం కోసం మనం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గూడూరు కృష్ణా రెడ్డి, మైత్రి సుబ్బారెడ్డి, పాపయ్య, వర రామారావు, దొడ్డ వెంకటరామిరెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: