ఇల్లు కాలిపోయి నిరాశ్రయులు అయిన కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ కట్టి ఇవ్వాలి
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామంలో పొనగంటి నాగేష్ అనే నిరు పేద కుటుంబానికి చెందిన ఇల్లు గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయం గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ప్రమాదవశాత్తు పంటలు చెలరేగి ఇళ్లు పూర్తి కాలి పోయినది. నిరాశ్రయులైన వారికి రమణక్కపేట కాంగ్రెస్ గ్రామ పార్టీ నాయకులు పరామర్శించి తక్షణమే తాత్కాలిక ఇంటి నిర్మాణం కోసం 27 వేల రూపాయల విలువ గల సిమెంట్ రేకులు సిమెంట్ పోల్స్ ఇనుప రాడ్లు ఇంటికి కావల్సిన సామగ్రిని, వాటితో పాటు బియ్యం నిత్యావసర వస్తువులు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ పోనగంటి నాగేష్ కుటుంబానికి కాదు, గ్రామంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. సర్వం కోల్పోయిన నిరుపేద నాగేష్ కు ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలక్రిష్ణ, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇందారపు లక్ష్మణ్ రావు, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు,బట్ట చందర్ రావు,గుమ్ముల మల్లికార్జున్, తిరుమలరావు,సుధీర్, బొనుగు సుబ్బారావు, పయ్యావుల బాబు రావు, మంచర్ల రాంబాబు,రవీందర్, అంజి బాబు,నవీన్, పాల్గొన్నారు.
Post A Comment: