CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రంజాన్ పండుగ సందర్భంగా ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి క్వింటా బియ్యాన్ని వితరణ:ఓసి 2 రిలే సి ముస్లిం సోదరులు

Share it:

 


    

మన్యం టీవీ మణుగూరు:

ముస్లిం సోదరుల పవిత్ర    రంజాన్ పర్వదినం *ఈద్ ఉల్ ఫితర్* సందర్భంగా స్థానిక పీకే ఓసి రిలే-సి ముస్లిం సోదరులు ఆధ్వర్యంలో శుక్రవారం నాడు అశ్వాపురం ఆరిఫా &రోష్ని వృద్ధాశ్రమానికి బియ్యాన్ని వితరణగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.ప్రముఖ పాత్రికేయురాలు అనిత లలిత్ కుమార్ ఏలిశెట్టి ముఖ్య అతిధులుగా పాల్గొని బియ్యాన్ని  వృద్ధాశ్రమం నిర్వాహకురాలు ఎస్ కే షేహనాజ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టకాలంలో ఇలాంటి వృద్ధాశ్రమాలకు తమ సహకారం అందించాలని దాతలను ఆమె కోరారు.సింగరేణి అధికారులు కార్మికులు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.క్వింటా బియ్యాన్ని వితరణ గా అందజేసి,అనంతరం సేమ్యా విందును ఏర్పాటు చేసిన ఓసి 2 రిలే -సి ముస్లిం సోదరులను ఆమె అభినందించారు.తమతో పాటు తమ తోటి వారి ఆకలి తీర్చాలనే ముస్లిం సోదరుల తపనను ఆమే  కొనియాడారు.30 రోజుల ఉపవాస దీక్ష అనంతరం ముస్లింలు జరుపుకునే పండుగ అని మత సామరస్యానికి ప్రతీక గా ఈద్-ఉల్-ఫితర్ ను ఆమె అభివర్ణించారు.అనంతరం వృద్ధులకు రంజాన్ స్పెషల్ సేమియా విందులో ఆమె పాల్గొన్నారు.వృద్ధాశ్రమానికి తన వంతు కర్తవ్యంగా రూ.1000 ఆర్థిక సహకారం అందించారు.ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు,ఓసి 2 రిలే-సి కార్మికులు ఎస్డి.నాసర్ పా షా,ఏ.మంగీలాల్,ఎస్కె.మేహరాజ్,హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: