•కొండపల్లి శ్రీధర్ డిమాండ్.
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
దేశవ్యాప్తంగా ఆశ కార్యకర్తల సమ్మెలో భాగంగా సోమవారం చండ్రుగొండ మండలంలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ సమ్మెలో పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలందరూ కలిసి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో ప్లే కార్డులతో నిరసన తెలిపారు. అనంతరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ కి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన కరోనా నేపథ్యంలో ఆశ కార్మికులు ముందువరుసలో ఉండి. సేవ చేస్తుంటే వారికి కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని దీంతో కుటుంబలు గడవడం చాలా కష్టంగా మారిందన్నారు. నెలకు కేవలం రెండు వేల రూపాయల పారితోషికాన్ని ఎక్కువ మంది ఆశ వర్కర్స్ పొందుతున్నారని ఈ రెండు వేల రూపాయల తో వారి కుటుంబాల పోషణ ఎలా జరుగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కనీస వేతనం 21 వేల రూపాయల చెల్లించాలని కరోనా సేవలకు ప్రత్యేకమైన ఇన్సెంటివ్ ఇవ్వాలని 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని కరోనా సోకిన వారికి ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి యాస నరేష్, దాసరిసీతారాములు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రుక్మిణీ, విజయ, పద్మ, కుమారి, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: