CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గూడెపు మౌనిక కు న్యాయం చేయాలని ఇద్దరు మంత్రులకు వినతిపత్రం

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

గూడెపు మౌనిక కు న్యాయం జరిగే వరకు అండదండగా ఉంటాం అని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి అన్నారు. 

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ములుగు కలెక్టర్ కార్యాలయం లో ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ మంత్రులకు మౌనిక న్యాయం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గూడెపు మౌనిక ను రెండు సంవత్సరాల కాలం పాటు ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని కులం పేరుతో దూరం పెట్టిన వైనం మంత్రివర్యుల కు సవివరంగా గా విన్నవించారు.మంత్రివర్యులు ఇద్దరు కూడా పోలీసువారికి  అమ్మాయికి సహకరించాలని చెప్పారు. ప్రజా సంఘాలు కూడా విన్నవించడం జరిగింది.తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ మౌనిక కు న్యాయం చేయాలని మంత్రివర్యులు పోలీసు వారు సహకరించాలని కోరారు. న్యాయం జరిగే వరకు మౌనిక రెండు సంవత్సరాల ప్రేమ పేరుతో మోసం చేసిన బార పాటు సాయి సూర్య వర్మ కుటుంబం దళితుల పట్ల వివక్ష విడనాడి పెళ్లి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బందెల యాద లక్ష్మి,రాష్ట్ర కార్యదర్శి ఇ గోస్కుల రాంబాబు, జిల్లా అధ్యక్షుడు రాజమల్ల సుకుమార్,కర్రి శ్యాం బాబు,ముంజాల బిక్షపతి, లింగమల్ల రమాదేవి, బొడ రాములు, దినకరన్,ఓట్ల మోహన్, సాంబయ్య,గడ్డం నరసన్న, కుమారస్వామి,నూకల రమేష్, గుంటక నాగేశ్వరరావు,బల్లి పాటి నాగరాజు కర్రీ దినకర్ దొడ్డ రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: