మన్యం టీవీ మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామనుజవరం గ్రామ పంచాయతీ కొత్త మల్లెపల్లి నిర్వాసిత గ్రామంలో డెంగ్యూ జ్వరంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దాదాపు 20 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఒక పక్క కొరోనా మహమ్మారి విజృంభించి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది.కాబట్టి అధికారులు స్పందించి జిల్లా మెడికల్ బృందాన్ని ఏర్పాటు చేసి కొత్త మల్లెపల్లి గ్రామ ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, మేరుగైన వైద్యం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోల్లోజు అయోధ్య డిమాండ్ చేశారు.
Post A Comment: