మన్యం టివి,దమ్మపేట: 16-04-2021
నిన్న హైదరాబాదులో గాంధీ భవన్ దగ్గర షర్మిలక్క దీక్ష ముగిశాక పాదయాత్ర వెళుతున్న షర్మిల అక్కను అడ్డుకొని పోలీసులు విచక్షణ కోల్పోయి ఒక మహిళపై అంత దారుణంగా ఎటాక్ చేస్తూ ఒంటిపై బట్టలు చింపి చేతులకు దెబ్బలు తగిలిన వదలకుండా అంత దౌర్జన్యం చేస్తున్నారు.నిరుద్యోగుల కోసం గళమెత్తిన షర్మిల అక్కను అడ్డుకున్నందుకు మన దమ్మపేట లో వై ఎస్ ఆర్ సి పి నాయకులు నిరసన చేపట్టారు. మన దమ్మపేట లో గాంధీ విగ్రహం దగ్గర నిరసన పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సోయం భద్రం ఆధ్వర్యంలో మహిళా సంఘం అధ్యక్షురాలు షేక్ జాన్ బి,మండలి లీడర్ ఫిరోజ్ పాకనాటి శ్రీను తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
Post A Comment: