భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుండి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ తరపున ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నిజాయితీ పరుడైన ఆదివాసీ గిరిజన మాజీ ఎమ్మెల్యే *గుమ్మడి నర్సయ్య* గారికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఇటీవల గుమ్మడి కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో నడవలేని స్థితిలో ఉన్నారు. గుమ్మడి కుటుంబ సభ్యులు, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, గుమ్మడి కాలుకు వైద్యం చేయించే నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. గత వారం రోజులుగా హాస్పిటల్ కి తిరిగిన నేపథ్యంలో ఈరోజు కోవిడ్ పరీక్ష చేయించుకోగా గుమ్మడి నర్సయ్య గారికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. గుమ్మడి తన స్వగృహం టేకులగూడెంలో హోం క్వారంటైన్ లో ఉన్నారు. గుమ్మడి తో పాటు ఉన్న ఆ పార్టీ రాష్ట్ర నేత రాయల చంద్రశేఖర్ హోం ఐసోలేట్ అయ్యారు. గుమ్మడి నర్సయ్య గారి ఆరోగ్యం ప్రస్తుతానికి మంచిగానే ఉందని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.
Post A Comment: