మంగపేట ఎస్ఐ శ్రీనివాస్
మన్యం టీవీ మంగపేట.
తెలంగాణల్ కరోనా సెకండ్ వేవ్ మొదలై కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విదిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెం.87 విడుదల చేసి కీలక నిర్ణయం తీసుకుందని రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ప్రజలు బయట తిరగడం నిషేధించబడిందని మంగపేట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.కరోనాను నియంత్రిం చేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు 20 రాత్రి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనుందని కావున మండల పరిధిలోని ప్రజలు వ్యాపారస్తులు రాత్రి 8 గంటల వరకు తమ వ్యాపారాలను ముగించవలెను అదే విధంగా రాత్రి 9 గంటల నుండి ప్రజలు బయట తిరగకుడదు.క్రింది నిబంధనలు ఉల్లగించిన వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము
అత్యవసర సేవలు నిత్యావసర సరుకుల రవాణా మెడిసిన్ మీడియా రవాణా నీటి సరఫరా సంబందించిన సేవలు మినహాయింపు కావున ప్రజలు కర్ఫ్యూ కి సహకరించి కరోన వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలరని పోలీసుల విజ్ఞప్తి చేశారు.
పై నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘింస్తే సెక్షన్ 188 ఐపిసి సెక్షన్ 5, 60 డిఎం యాక్టు 2005 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావున ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మారిని నియంత్రణకు సహకరించాలని ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు.
Post A Comment: