మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం తిమ్మంపేట గ్రామం బీసీ కాలనిలో కీర్తి శేషులు గోనె తిరుపతి మాజీ సర్పంచ్ మొదలు పెట్టిన బడుగు బలహీన వర్గాల విద్యా ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ పనుల పునప్రారంభం గురించి పూజారి సురేంద్ర బాబు అధ్యక్షతన తిమ్మంపేట బీసీ కాలనీలోని కొట్టే సమ్మయ్య ఇంటి దగ్గర ,సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో బీ సి కాలనీలోని పెద్దలు, గ్రామంలోని యువకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పూజారి సురేంద్ర బాబు మాట్లాడుతూ కీర్తి శే షులు గోనె తిరుపతి మొదలు పెట్టిన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని గ్రామంలోని పెద్దలు, యువకులు, పూలే అంబేద్కర్ వారసులు,కులాలకు, పార్టీలకు అతీతంగా, అందరి భాగస్వామ్యం తో పూర్తి చేయడానికి,దీని కొసం సమాలోచనలు చెయ్యడానికి తదుపరి మీటింగ్ 23.04.2021.తిమ్మంపెటలోని హై స్కూల్ లో ఉదయం 10 గంటలకు కఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి గ్రామంలో ని అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాల్సిందిగా కోరారు.అందరూ ఆహ్వానితులే..ఈ సమావేశంలో పగిడిపల్లి వెంకటేశ్వర్లు మాజీ ఆత్మ చై ర్మన్ గారు,కొట్టే సమ్మయ్య,ఎదురుగట్ల రామస్వామి ,డాక్టర్ రాంబాబు , బసారి హరికృష్ణ , ముక్కెర శ్రీను,బొంబోతుల మురళి,గోనె కేశవులు ,పుల్లూరి శ్రావణ్,బోడ బొర్రయ్య, సి పీ యం పార్టీ ఎల్ పీ ముత్యాలు, ఎంపెళ్లి వీరస్వామి స్వేరో,ఎంపెళ్లి చందర్ రావు, ఎంపెళ్లి అరవింద్ తదితరులు పాల్గొన్నారు...వీరస్వామి స్వేరో ఎంపెళ్లి.
Post A Comment: