CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన గులాబీ నేతకు అధికారిక తుది వీడ్కోలు

Share it:

 


*మాజీ మంత్రి చందూలాల్ అంత్యక్రియలకు హాజరై ప్రభుత్వం తరుపున నివాళులు అర్పించిన మంత్రులు ఎర్రబెల్లి,సత్యవతి

*వారి వెంట పాల్గొన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు

*అశ్రు నయనాలతో అంతిమ సంస్కారాలు

మన్యం టీవీ ఏటూరునాగారం:


నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించిన గిరిజన హక్కుల ఉద్యమ నేత,గులాబీ నేత మాజీ మంత్రి చందూలాల్ అంత్యక్రియలు ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ లంఛానాలతో నిర్వహించారు.ఈ అంత్యక్రియలకు ప్రభుత్వం తరుపున రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,స్త్రీ,శిశు సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై చందూలాల్ దేహానికి నివాళులు అర్పించారు.వారితో పాటు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్,మాజీ డిప్యూటీ సీఎం,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య,ఇతర అధికారులు,నేతలు హాజరై అంతిమ సంస్కారాలలో పాల్గొని ఘనంగా తుది వీడ్కోలు పలికారు.ఆ తరువాత వారి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి గిరిజన ఉద్యమ నాయకుణ్ణి కోల్పోయామని,ఆయన చేసిన సేవలు మరువలేనివి అని  వారి సేవలను గుర్తు చేసుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: