మన్యం టీవీ, దమ్మపేట:
తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ద్వారా వెలువడిన మన్యం మనుగడ పత్రిక యొక్క ప్రత్యేక సంచికను దమ్మపేట భారత్ పెట్రోలియం లో పనిచేస్తున్న ఆదివాసి కార్మికులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలపై పత్రిక రావడం సంతోషంగా ఉందని పత్రిక స్థాపించిన రేగా కాంతారావు గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. జన్మదినం సందర్భంగా వచినటువంటి ప్రత్యేక సంచికను అందించిన అశ్వరావుపేట మన్యం టీవీ ప్రతినిధి దాది చంటి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమరం వెంకటేష్, మచ్చల ప్రసాద్, సోయం శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: