ఎన్నిక ఏదైనా గెలుపు కేసీఆర్ దే అని ప్రజలు నిరూపించారని కేటీఆర్ అన్నారు. గతంలో రూ.200 రూపాయల ఉన్న పెన్షన్ ను తెలంగాణ వచ్చినాక రూ.2వేల 16కు పెంచామన్నారు. వికలాంగులకు రూ.3 వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు.వరంగల్ పర్యటనలో భాగంగా కేటీఆర్ మొత్తం రూ.1,700 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, టీ రాజయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. రూ.1589కోట్ల రూపాయలతో వరంగల్ కు ప్రతీరోజు నీరిచ్చే కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనన్నారు. కరోనా కారణంగా నిధుల కొరత వల్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఆలస్యం అయిందని కేటీఆర్ చెప్పారు.
బీజేపీ నాయకులు కొత్త బిక్షగాళ్లు
బీజేపీ నాయకులు కొత్త బిక్షగాళ్లని విమర్శించారు. ప్రధాని మోదీ ఇస్తానన్న రూ.15లక్షలు ఏమయ్యాయ్ అని ప్రశ్నించారు. ‘కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది.. మోదీ ప్రభుత్వంలో పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగాయి.’ అని కేటీఆర్ విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు.
సీఎం కేసీఆర్ కు వరంగల్ పై ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. ఏడాదికి రూ.300 కోట్లు ఇస్తున్నారన్నారు. ఇవాళ రూ.2500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశినట్టు కేటీఆర్ చెప్పారు. వరంగల్ ను ‘గ్లోబల్ సిటీ’గా మారుస్తామన్నారు. వరంగల్ కు మోనో రైల్ తెస్తామని చెప్పారు. కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఆదరించండని కేటీఆర్ కోరారు.
Post A Comment: