CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేస్తాం

Share it:

 



ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి- ఎస్.ఐ శ్రీనివాస్


మన్యం టీవీ మంగపేట.

మాస్కులు ధరించని వారిపై ఇకనుంచి తప్పకుండా కేసులు నమోదు చేస్తామని,రూ,1000 లు జరిమానా విధిస్తామని, మంగపేట మండల ప్రజలు అందరూ తప్పకుండా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి, చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా కరోనా వ్యాధి వ్యాప్తి కాకుండా  సహకరించాలని మంగపేట ఎస్.ఐ చింతళతాళం శ్రీనివాస్ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన రాజుపేట లో విలేకరులతో మాట్లాడుతూ కరోనా నియమ నిబంధనలు పాటించడం వలన మీ కుటుంబాన్ని కరోనా వ్యాధి బారినపడకుండారక్షించడంతోపాటు,సమాజానికి మేలుచేసినట్లవుతుందన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానమై ఉన్న ఇక్కడి సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా మాస్కులు దరించని వారిని ప్రత్యేకంగా గుర్తించి వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.మండలంలోని పలు ప్రధాన కూడళ్లలో కరొనా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇప్పటివరకు ములుగు  జిల్లాలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 82 ప్రకారం ఈ చాలన్ విధానం ద్వారా మాస్క్ ధరించని 243 వ్యక్తుల పై వెయ్యి రూపాయల ఫైన్ పోలీసు శాఖ ద్వారా విధించామని, అలాగే రోడ్డుపై వాహనాల తనిఖీ తో పాటు మాస్కులు ధరించని వ్యక్తులను గుర్తించి వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Share it:

TELANGANA

Post A Comment: