CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని చండ్రుగొండ మండలం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు.

Share it:

 


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:

చండ్రుగొండ మండల వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అధికారులు ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బానోతు అధ్యక్షతన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తహశీల్దార్ కార్యాలయం రెవిన్యూ సిబ్బంది నివాళులర్పించారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మండల ప్రధాన సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దేశంలో దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలు బడుగు బలహీనవర్గాల స్థితిగతులను ఆలోచించి ప్రభుత్వ ఫలాలు వారందరికీ దక్కాలని సమాజములో వారందరికీ  సముచిత స్థానం దక్కాలనే  సంకల్పంతో నాటి రాజ్యాంగాన్ని రచించిన అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యదైవం గా నిలిచిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని. వారి బాటలోనే నేటి యువత కూడా పయనించాలని పలువురు ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ బానోత్ పార్వతి, జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎస్టీ రసూల్, జెడ్పిటిసి కొడకండ్ల వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, ఎంపీటీసీ దారా బాబు, ఎంపీడీవో డి అన్నపూర్ణ, ఎంపివో తోట తులసీరామ్, స్టాఫ్ నర్స్ శంకరమ్మ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు భోజ్యానాయక్, టిడిపి మండల అధ్యక్షుడు వారధి సత్యనారాయణ, సిపిఎం మండల పార్టీ అధ్యక్షుడు యాస నరేష్, సిపిఐ మండల  అధ్యక్షుడు బొర్రా కేశవ్, ప్రజా సంఘాల నాయకులు మూడు బాలాజీ నాయక్, చాపలమడుగు వెంకటేశ్వర్లు, రెడ్డిపోగు సురేష్, దినేష్, సినీ రచయిత కుక్కముడి బాలప్రసాదు, గుగులోత్  మోహన్ నాయక్, గుగులోత్ రాంబాబు, బొర్రా సురేష్, కేశబోయిన నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: