దళిత బిడ్డకు న్యాయం చేయాలి
*గూడెపు మౌనిక కు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం.
*తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గొస్కుల రాంబాబు ములుగు జిల్లా అధ్యక్షుడు రాజమల్ల సుకుమార్.
మన్యం టీవీ ఏటూరునాగారం:
తెలంగాణ మాల మహానాడు ఏటూరునాగారం మండల కేంద్రంలో తెలంగాణ మాల మహా నాడు మండల అధ్యక్షుడు చిక్కుల విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గోస్కుల రాంబాబు,ములుగు జిల్లా అధ్యక్షుడు రాజమల్ల సుకుమార్ లు హజరై మాట్లాడుతూ గత ఇరవై ఏడు రోజులుగా ములుగు జిల్లా కేంద్రంలో తాను ప్రేమించిన సాయి సూర్య వర్మ ఇంటి ముందట తనను పెళ్లి చేసుకోవాలి. అనే డిమాండ్ తో బండారుపల్లి గ్రామానికి చెందిన గూడెపు మౌనిక ఎస్సీ మాల కులానికి చెందిన అమ్మాయి పోరాటం చేస్తున్న ములుగు జిల్లా లో ఉన్న ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఆ దళిత బిడ్డ న్యాయమైన పోరాటానికి కనీస సంఘీభావం కూడా చేయకపోవడం చూస్తుంటే ములుగు జిల్లా లో దళితులపైన రాజకీయ పార్టీ నాయకులకు ఉన్న ప్రేమ స్పష్టంగా అర్థం అయిపోతుందని, నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లాలో దళితులపై దాడులు అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, రెండు సంవత్సరాలుగా దళిత బిడ్డ వెనక తిరిగి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లోబర్చుకొని తీరా పెళ్లి చేసుకోమంటే నువ్వు తక్కువ కులానికి చెందిన వ్యక్తి నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటూ నిన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతుందని చెబుతున్నాడని దళిత బిడ్డ వాఊ పోతుందని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి గోసుల రాంబాబు తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా అధ్యక్షులు రాజమల్ల సుకుమార్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి నిమ్మగడ్డ ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి బోడ శ్రీను, ఏటూరునాగారం మండల నాయకులు గద్దల నవీన్, కొలుకుల నాగేంద్రబాబు, వెంకటస్వామి, ప్రశాంత్, ప్రణయ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: