CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే ఆపేయాలి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్...

Share it:

 





మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే ఆపేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.ఈ విషయమై శుక్రవారం రోజున తహశీల్దార్ లూథర్ విల్సన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని గుండేపూడి గ్రామపంచాయతీ, వీరభద్రపురం,  సమీపంలో రెవెన్యూ భూముల గుట్టలను రెవెన్యూ, మైనింగ్ శాఖల అనుమతి లేకుండా అక్రమ మట్టి తోవ్వకాలు జరుగుతున్న రెవెన్యూ అధికారులు స్పందించకపోకపోవడం లోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

సీలింగ్ భూమి అయిన సర్వే నెంబర్ 117,274 లలో రోజు లారీ లతో మట్టి తవ్వకాలు జరిపి, తొవ్వకాలు చేసిన మట్టిని తహశీల్దార్ కార్యాలయం ముందు నుండి తరలిస్తున్న అధికారులు పట్టించుకొకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు.తక్షణమే అక్రమ మట్టి తొవ్వకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేనియెడల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు కో-ఆర్డినెటర్ మాట్టే.గురుమూర్తి, జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల. నరసింహరావు,దామోదర్, నాగరాజు,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: