మన్యం టీవీ చర్ల చర్ల మండలం లోని అంబేద్కర్ సెంటర్ వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి 130వ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. మాలమహానాడు మండల సభ్యులు బోళ్ల వినోద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో దేశ యువత నడవాలని, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగ విధులు, హక్కులు అనుగుణంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు మండల అధ్యక్షులు గోపాల్ రావు, దొడ్డి ప్రభుదాస్, సతీష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: