మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు టిఆర్ఎస్ భవన్ లో మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు ఆధ్వర్యంలో బుధవారం ఆర్థిక వేత్త,ప్రపంచ మేధావి, అంటరానితనం వివక్ష లపై అలుపెరుగని పోరు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక జడ్పీటీసీ, జిల్లా జడ్పీటీసీ సంఘం అధ్యక్షులు పొశం. నర్సింహారావు హాజరై అంబేద్కర్ చిత్ర పటానికి పులా మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం టిఆర్ఎస్ నాయకులు పూలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, మండల కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, రామనుజవారం ఉప సర్పంచ్ ప్రబుదాస్, టిఆర్ఎస్ నాయకులు ఎడ్ల.శ్రీనివాస్ ముద్దంగుల కృష్ణ,ఆవుల.నర్సింహారావు, వెంకట్ రెడ్డి,ఉప్పుతల. రామారావు,తాత రమణ, వేముల.లక్ష్మయ్య,మేకల రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: