మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు మల్లెల మడుగు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కోడి కృష్ణవేణి ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని ఆవాస ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లించడం జరుగుతుంది. కరోనా సెకండ్ వెవ్ ఉదృతంగా ఉండడంతో గ్రామ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని చేతులు పరిశుభ్రంగా కనుక్కోవాలని అత్యవసరం అయితే తప్పఇంట్లో నుంచి బయటకు రావద్దని సర్పంచ్ సూచించారు. అలాగే గ్రామ ప్రజలందరూ కారోన వ్యాక్సిన్ వేయించుకోవాలని వారు తెలిపారు. ప్రస్తుతం మన గ్రామంలో 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వారందరూ క్షేమంగానే ఉన్నారని వారు తెలిపారు.
Navigation
Post A Comment: